యూట్యూబ్‌ ఛానెల్స్ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన గీతా మాధురి !

యూట్యూబ్‌ ఛానెల్స్ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన గీతా మాధురి !

Published on Oct 15, 2018 6:36 PM IST

తెలుగు సినిమాలలో అనేక శ్రావ్యమైన పాటలు పాడి తెలుగు సినీ గాయనిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న గాయని గీతా మాధురి. బిగ్ బాస్ సీజన్ 2‌లో పాల్గొని.. ఇటీవలే రన్నరప్‌గా నిలిచిన ఆమె పై కొన్నియూట్యూబ్‌ ఛానెల్స్ అసత్య ప్రచారం చేసాయి. దాంతో గీతా మాధురి ఆ ఛానల్స్ పై ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

నా పై తప్పుడు ప్రచారం చేసి.. నా పై అసత్య కథనాలతో వీడియోలు పెట్టిన కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్ పై నేను చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాను అని ఆమె తెలిపింది. అయితే తానూ చట్టపరమైన చర్యలు తీసుకోబోయే ముందు ఆ వీడియోలను తొలిగించడానికి, సదరు యూట్యూబ్‌ ఛానెల్స్ కి కొంత సమయం ఇస్తున్నానని కూడా గీతా మాధురి చెప్పారు. మరి ఆ ఛానల్స్ ఆ వీడియోలను తొలిగిస్తాయో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు