సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రం ‘మహర్షి’ ప్రస్తుతం యూఎస్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టెలివిజన్ ఛానెల్ జెమినీ టీవీ దక్కించుకుంది. భారీ పోటీనడుమ భారీ మొత్తం చెల్లించి ఈ హక్కులను చేజిక్కించుకుంది.
వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా ప్రముఖ హీరో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీ దత్ , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.
.@GeminiTV buys the broadcast rights of @urstrulyMahesh and @hegdepooja's #Maharshi movie directed by @directorvamshi.
— Gemini TV (@GeminiTV) October 17, 2018