విన్నర్ దర్శకుడితో గోపించంద్ ?

విన్నర్ దర్శకుడితో గోపించంద్ ?

Published on Oct 23, 2018 1:59 AM IST

వరుస పరాజయాలతో కొనసాగుతున్నమాచో హీరో గోపిచంద్ కు ఇటీవల విడుదలైన ‘పంతం’ సినిమా కూడా అనుకున్న విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ఈ చిత్రం విడుదలై సుమారు 4నెలలు కావస్తున్నా ఈ హీరో తన కొత్త చిత్రాన్ని ఇంతవరకు ప్రకటించలేదు.

అయితే తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం గోపిచంద్ ‘విన్నర్, బలుపు’ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నటించడానికి సన్నద్ధం అవుతున్నాడట. శ్రీ బాలాజీ సినీ మీడియా ఈచిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. త్వరలోనే ఈ విషయం ఫై అధికారిక సమాచారం వెలుబడే అవకాశాలు వున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు