విద్యార్థులను కలవనున్న “గుణ 369” టీమ్.

విద్యార్థులను కలవనున్న “గుణ 369” టీమ్.

Published on Jul 20, 2019 12:20 PM IST

యంగ్ హీరో కార్తికేయ,అనఘా ప్రధాన పాత్రలలో దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం “గుణ 369”. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్,స్ప్రింట్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై అనిల్ కడియాల,తిరుమల రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి స్పందన అందుకుంది.

కాగా “గుణ 369” టీమ్ చిత్ర ప్రమోషన్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఈ చిత్ర యూనిట్ రేపు వైజాగ్ వెళ్లనున్నారు. వైజాగ్ లోని రెండు కళాశాలల విద్యార్థులతో కలిసి సందడి చేయనున్నారు. వారితో చిత్ర విశేషాలు పంచుకోనున్నారు. మధ్యాహ్నం 1కి విజ్ఞాన్ కాలేజ్ కి,ఆతరువాత 3గంటలకి రఘు కాలేజ్ ని సందర్శించనున్నారు. ఆగస్టు 2న విడుదల కానున్న ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు