స్కూల్ ని దత్తత తీసుకున్న మెగా హీరో…!

స్కూల్ ని దత్తత తీసుకున్న మెగా హీరో…!

Published on Jul 9, 2019 1:14 PM IST

మెగా యంగ్ హీరోలలో ఒకరైన ధరమ్ తేజ్ తన మార్కు మేనరిజం,డాన్సులు, డైలాగ్స్ తో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.తాజాగా చిత్రలహరి మూవీతో ఓ క్లాసిక్ హిట్ అందుకున్న ఈయన మారుతి దర్శకత్వంలో “ప్రతిరోజు” పండగే” చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఐతే ఈ యంగ్ హీరో సామాజిక సేవ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. రెండేళ్ల క్రితం ధరమ్ తేజ్ అక్షరాలయ అనే ఓ స్కూల్ ని దత్తత తీసుకొని అందులో గల 100మంది విద్యార్థులకు కావలసిన పౌష్టికాహారం,స్టేషనరీ మరియు ఇతర సౌకర్యాలు అందినారు. థింక్ పీస్ అనే ఒక సేవా సంస్థ ద్వారా ఈ స్కూల్ ని రెండేళ్లకు దత్తత తీసుకోవడం జరిగింది.

ఐతే ఇంకొన్ని సంవత్సరాలు అక్షరాలయ స్కూల్ ని దత్తత తీసుకోవడానికి,ధరమ్ తేజ్ నిర్ణయించడంతో థింక్ పీస్ ఛారిటీ సంస్థ ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు.అలాగే రెండేళ్ల క్రితం చిరంజీవి వ్యాఖ్యాతగా ప్రసారం అయిన మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో పాల్గొన్న ధరమ్ తేజ్ తాను గెలుచుకున్న మొత్తాన్ని దానం చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు