నిర్మాత ఫిర్యాదు చేసినా రామ్ షూట్ కి రెడీ !

నిర్మాత ఫిర్యాదు చేసినా రామ్ షూట్ కి రెడీ !

Published on Jul 5, 2021 12:02 AM IST

హీరో రామ్ పోతినేనితో తమిళ దర్శకుడు లింగుస్వామి చేయబోతున్న సినిమాని ఆపాలని తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. ఈ సినిమా ఆపాలని జ్ఞానవేల్ రాజా ఫిల్మ్ ఛాంబర్ కి ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి సినిమా చేస్తానని జ్ఞానవేల్ రాజా నుంచి కొంత డబ్బు తీసుకున్నాడు లింగుస్వామి. ఆ తర్వాత తానూ చెయ్యాల్సిన సినిమా చెయ్యకుండా, లింగుస్వామి సైలెంట్ గా రామ్ తో సినిమా మొదలు పెట్టాడు.

కానీ హీరో రామ్ ఈ ఫిర్యాదుని లైట్ తీసుకుని షూట్ కి రెడీ అయిపోయాడు. ఈ సినిమా షూటింగ్ సాంగ్ తోనే మొదలు కానుంది. సారధి స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సాంగ్ ను తీయనున్నారు. ఇక ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటల్లో రెండు ట్యూన్స్ ఇప్పటికే ఫైనల్ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు