గోపిచంద్ మార్కెట్ కు మించి ఖర్చు పెడుతున్నారు !

గోపిచంద్ మార్కెట్ కు మించి ఖర్చు పెడుతున్నారు !

Published on Jan 22, 2019 4:29 PM IST

మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న మ్యాచో హీరో గోపిచంద్ కి గత కొంత కాలంగా అస్సలు కలిసి రావడం లేదు. ఇటీవల అయన నటించిన చిత్రాలు బాక్సాఫిస్ వద్ద అనుకున్నంతగా కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. దాంతో గోపి మార్కెట్ కూడా పడిపోయింది. అయితే ఈ విషయాలను పెద్దగా పట్టించుకోని నిర్మాతలు గోపిచంద్ కొత్త చిత్రానికి భారీగా ఖర్చు పెడుతున్నారు.

ప్రస్తుతం గోపిచంద్, తిరు దర్శకత్వంలో తన 26వ చిత్రంలో నటిస్తున్నారు. నిన్ననే ఈ చిత్రం యొక్క షూటింగ్ జైసల్మేర్ లోని ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో మొదలయ్యింది. ఈ లాంగ్ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమా కోసం ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడట్లేదు నిర్మాతలు. ఈచిత్రం కోసం ఏకంగా 32కోట్ల బడ్జెట్ ను కేటాయించారట. మరి ఇంత పెద్ద మొత్తంలో రికవరీ కావాలంటే సినిమాకు బ్లాక్ బ్లాస్టర్ టాక్ రావాల్సిందే. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు