వారికి నా కృతజ్ఞతలు – మెగాస్టార్

వారికి నా కృతజ్ఞతలు – మెగాస్టార్

Published on Apr 9, 2020 1:41 PM IST


మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) సినీకార్మికుల్ని ఆదుకునేందుకు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. కాగా ముందే ప్ర‌క‌టించిన‌ట్టే ఇండస్ట్రీలోని 24 శాఖ‌ల కార్మికుల్లోని పేద‌ల‌కు స‌రుకుల్ని పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మెగాస్టార్ ట్వీట్ చేస్తూ.. ‘కరోనా క్రైసిస్ చారిటీ నుండి చిత్ర పరిశ్రమలోని రోజువారీ వేతన కార్మికులకు నిత్యవసర వస్తువులు పంపిణి చేయడం జరుగుతుంది. అవసరమైన వారికి డోర్ డెలివరీ కూడా అందజేస్తున్నాము. ఇక ఆహార సామాగ్రిని అన్ని జాగ్రత్తలతో అందిస్తున్నాము. ఈ మానవతా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు’ అని మెగాస్టార్ ట్వీట్ చేశారు.

కాగా మెగాస్టార్ ఏర్పాటు చేసిన సీసీసీకి ఇప్ప‌టికే తార‌లు స‌హా ప‌లువురు దాత‌ల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. దాంతో సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తి కార్మికుడికి ఇంటికి నెల‌కు స‌రిప‌డా బియ్యం-ప‌ప్పు ఉప్పు గ్రాస‌రీల్ని అందిస్తున్నారు. ద‌ర్శ‌క‌నిర్మాత‌ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ – ద‌ర్శ‌క‌సంఘం అధ్య‌క్షుడు శంక‌ర్ బృందం కార్మికుల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ కోసం న‌డుం కట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు