దంగల్ దర్శకుడితో గీతా ఆర్ట్స్ భారీ పౌరాణిక చిత్రం.

దంగల్ దర్శకుడితో గీతా ఆర్ట్స్ భారీ పౌరాణిక చిత్రం.

Published on Jul 8, 2019 12:22 PM IST

టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై భారీ పౌరాణిక చిత్రాన్ని చేయనున్నట్లు నేడు ప్రకటించారు. భారతీయ ఇతిహాసాలలో గొప్పదైన రామాయణ మహా కావ్యాన్ని తెరకెక్కించేందుకు ఆయన సిద్ధమయ్యారు.”రామాయణ” పేరుతో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను అల్లు అరవింద్ తో పాటు మధు మంతెన, ప్రైమ్ ఫోకస్ అధినేత నమిత్ మల్హోత్రా నిర్మాణ భాగస్వాములుగా కలిసి నిర్మిస్తున్నారు. తెలుగు,తమిళ,హిందీ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని 3డి సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రీకరించనున్నారట.

మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ “రామాయణ” చిత్రానికి ‘దంగల్’ డైరెక్టర్ నితీష్ తివారి, ‘మామ్’ మూవీ దర్శకుడు రవి ఉద్యావర్ కలిసి దర్శకత్వం వహిస్తారని సమాచారం. 2021వ సంవత్సరంలో మొదటి భాగం విడుదల కానున్న ఈ చిత్రం లోని నటులు, సాంకేతిక వర్గానికి సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు