బ్రేకింగ్ : అన్ని ప్లాట్‌ఫామ్‌లలో పాక్ కంటెంట్ తొలగింపు!

బ్రేకింగ్ : అన్ని ప్లాట్‌ఫామ్‌లలో పాక్ కంటెంట్ తొలగింపు!

Published on May 8, 2025 10:00 PM IST

ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశ భద్రతపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే ఎంటర్‌టైన్‌మెంట్‌కు సంబంధించిన అన్ని ప్లాట్‌ఫామ్‌లలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలను జారీ చేసింది.

ఈ ఆదేశాల మేరకు ఓటీటీ, మీడియా ప్లాట్‌ఫామ్ లతో పాటు మిగతా ఎంటర్‌టైనింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పాకిస్థాన్ దేశానికి చెందిన కంటెంట్‌ను పూర్తిగా తొలగించాల్సిందిగా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెబ్ సిరీస్, చిత్రాలు, సాంగ్స్, పాడ్‌కాస్ట్ తదితర మీడియాల్లో ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతున్న పాక్ సంబంధిత కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు