‘డిస్కోరాజా’ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

‘డిస్కోరాజా’ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ !

Published on Aug 7, 2019 12:00 AM IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం “డిస్కోరాజా”. కాగా ఈ సినిమాలో ర‌వితేజ సరసన హీరోయిన్స్ గా పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా హోప్‌ ముగ్గురు నటిస్తున్నారు. ఇక ఈ నెల 4 నుండి ఢిల్లీలో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం రవితేజ మరియు హీరోయిన్స్ పై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ముఖ్యంగా ఢిల్లీలోని రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తోన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ షెడ్యూల్ లో తాన్యా హోప్‌ పాల్గొంటుందట. గ్లామ‌ర్ పరంగా తాన్యా హోప్ కి తిరుగులేకపోయినా.. ఆమెకు పెద్దగా అవకాశాలు మాత్రం రాలేదు. కనీసం ‘డిస్కోరాజా’తోనైనా తాన్యా హోప్ కి కాలం కలిసి వస్తోందేమో చూడాలి. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత‌ రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు