అనసూయ హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , తెలుగు పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొన్న అనసూయ భరద్వాజ్ “రంగస్థలం” వంటి మూవీస్ లో ఆమె చేసిన పాత్రకు విశేషస్పందన లభించింది. ఆమె ప్రధాన పాత్రలో కనిపించనున్న “కథనం మూవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.
తాజా సమాచారం ప్రకారం సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న తాజా మూవీలో అనసూయ కు ఓ కీలక పాత్రను దర్శకుడు శివ ఆఫర్ చేశారని సమాచారం. ఇంత పెద్ద ప్రాజెక్టులో మంచి రోల్ దక్కడంతో అనసూయ కూడా ఓకే చెప్పేశారని అంటున్నారు. అయితే, అనసూయకు పారితోషికం కూడా గట్టిగానే ఇస్తున్నారని సమాచారం.ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. చిరంజీవి జన్మదినం పురస్కరించుకొని ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఆగస్టు 22 న నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి సరసన శృతి హాసన్ నటించే అవకాశాలున్నాయి.