నాయుడు తో శర్వానంద్ ఫిక్స్ అయినట్లేనా ?

నాయుడు తో శర్వానంద్ ఫిక్స్ అయినట్లేనా ?

Published on Nov 18, 2018 11:41 PM IST

సుధీర్ బాబు, నాభ నటేష్ హీరో హీరోయిన్లుగా ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం మంచి విజయం సాధించింది. మొదటి చిత్రం అయినప్పటికి ఆర్ ఎస్ నాయుడు ‘నన్ను దోచుకుందువటే’ చిత్రాన్ని చాలా చక్కగా తెరకేక్కించాడని.. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా మలిచాడని.. మంచి పేరు తెచ్చుకున్నాడు. దాంతో ఈ దర్శకుడుకి అవకాశాలు బాగానే వస్తున్నాయి.

కాగా ఇప్పటికే ‘పడి పడి లేచే మనసు’ నిర్మాత సుధాకర్ తమ బ్యానర్ లో ఓ చిత్రం చెయ్యమని ఆర్ ఎస్ నాయుడుకి అడ్వాన్స్ ఇచ్చారట. అలాగే మరో ఇద్దరు నిర్మాతలు కూడా నాయుడుతో టచ్ లో ఉన్నారని.. ఈ యంగ్ డైరెక్టర్ తో సినిమా చెయ్యటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారని తెలుస్తోంది.

అయితే ఈ దర్శకుడు మాత్రం హీరో శర్వానంద్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. తన దగ్గర ఉన్న స్క్రిప్ట్ శర్వానంద్ కి బాగుంటుందని.. అందుకే శర్వా కోసం వెయిట్ చేస్తున్నాడట. ఇప్పటికే శర్వాకి లైన్ కూడా వినిపించారట. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద్, ఆర్ ఎస్ నాయుడుతో కూడా సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు