సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఇపుడు చేస్తున్న అవైటెడ్ చిత్రాల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “కూలీ” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేస్తున్న ఈ చిత్రం కోసం పాన్ ఇండియా లెవెల్లో ఆడియెన్స్ గట్టిగానే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యి మిగతా పనులు అన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఈ ఫైనల్ పనుల్లో లేటెస్ట్ గా బ్యూటీ శృతి హాసన్ చేరింది.
అయితే ఈ చిత్రానికో లేక మరో సినిమాకో గాని ఇపుడు తాను డబ్బింగ్ చెబుతున్న విజువల్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతానికి అయితే డబ్బింగ్ చెప్పే రేంజ్ లో ఈ సినిమా మాత్రమే ఉంది కాబట్టి అభిమానులు ఈ సినిమానే అని అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏడాది ఆగస్ట్ 14న గ్రాండ్ గా చిత్రం రిలీజ్ కి రాబోతుంది.