స్టార్ డైరెక్టర్స్ వెబ్ ఎంట్రీ ఫిక్సేనా ?

స్టార్ డైరెక్టర్స్ వెబ్ ఎంట్రీ ఫిక్సేనా ?

Published on Jun 28, 2020 11:31 PM IST

కరోనా దెబ్బకి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ రూపురేఖలే మారిపోయాయి. ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ అందరూ వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి ఒక కామెడీ సిరీస్ చేయబోతున్నారట. అలాగే వంశీ పైడిపల్లి రెండు వెబ్ సిరీస్‌ లు చేయడానికి ఓకే చెప్పారట.

అలాగే డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఈ లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ కోసం ఓ ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసిన్నట్లు తెలుస్తోంది. మరి పూరి ఏ ప్లాట్ ఫామ్ కి వెబ్ సిరీస్ చేస్తాడో చూడాలి. మరో స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కూడా వెబ్ సిరీస్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి స్టార్ డైరెక్టర్స్ వెబ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు