మా అమ్మ ఎప్పుడు నాకు ఆ మాటలే చెప్పేది – జాన్వీ కపూర్

మా అమ్మ ఎప్పుడు నాకు ఆ మాటలే చెప్పేది – జాన్వీ కపూర్

Published on Jun 21, 2018 11:58 PM IST


అతిలోక సుంద‌రి శ్రీదేవి మరణం ఆమె అభిమానులను తీవ్ర దుఃఖంలో నెట్టేసింది. ఇప్పటికీ ఆ బాధలో నుండి వారు ఇంకా తేరుకోలేదు. ఆ విషయం గురించే శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ స్పందిస్తూ అమ్మ భౌతికంగా మనకి దూరమైనా మానసికంగా ఎప్పుడూ మనతోనే ఉంటారని, అమ్మ స్పర్శ ఎప్పుడూ నా చుట్టూనే ఉంటుందని ఆమె తెలిపారు. తన తల్లి శ్రీదేవి జీవించి ఉన్నప్పుడు త‌న‌తో చెప్పిన మాట‌ల‌ను గుర్తుచేసుకుంటూ అభిమానులతో పంచుకున్నారు.

శ్రీదేవి చెప్పిన మాటలను జాన్వీ చెప్తూ ‘ముందు మంచి మ‌నిషిగా మారితేనే మంచి న‌టిగా ఎదుగుతారు. ఎందుకంటే కెమేరా చాలా స్మార్ట్‌. మన ఎమోషన్ ఫేక్ అయితే కెమేరాలో అదే కనిపిస్తుంది. మ‌న‌సు ఎప్పుడూ శాంతంగా ఉండాలి. అప్ప‌డే మంచి న‌టిగా ఎదుగుతావు` అని తన తల్లి శ్రీదేవి తనతో చెప్పేది అని జాన్వి చెప్పారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు