‘విజేత’ లాంటి క్లాసిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ దేవ్ హీరోగా మరో యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఎం కుమారస్వామి నాయుడు దర్శకుడిగా, కథ కంచికి మనం ఇంటికి లాంటి కమర్షియల్ చిత్రాన్ని నిర్మించిన ఎం పి ఆర్ట్స్ బ్యానర్పై మోనిష్ పత్తిపాటి నిర్మాతగా, దత్తి సురేష్ బాబు క్రియేటివ్ ప్రోడ్యూసర్గా నిర్మిస్తున్న ఈ చిత్రం నేడు కూకట్పల్లి తులసివనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనుంది. ఈ సినిమాకు వైఎస్ కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గౌతి హరినాథ్ నిర్మాణ నిర్వహణ చూసుకుంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే తెలియచేయనుంది.
యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్న కళ్యాణ్ దేవ్..!
యాక్షన్ ఎంటర్టైనర్తో రాబోతున్న కళ్యాణ్ దేవ్..!
Published on Sep 2, 2021 8:54 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మీకు తెలుసా? : కమల్ తో సౌందర్య చేయాల్సిన మొదటి సినిమా ఇదని
- లెటర్బాక్స్డ్ టాప్ 100 లో మహేష్ బాబు డబుల్ బొనాంజా
- ఈ ఓటిటి ప్లాట్ ఫామ్ లో “ఓ మై గాడ్ 2” తెలుగు
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘ఫ్యామిలీ స్టార్’
- బజ్ : మ్యూజికల్ అప్ డేట్ కి రెడీ అవుతోన్న ‘డబుల్ ఇస్మార్ట్’ ?
- SSMB 29 : అందుకే మహేష్, రాజమౌళి హఠాత్తుగా తిరిగివచ్చారా ?
- ‘అఖండ – 2’ : ఆ రోజున అనౌన్స్ మెంట్ రానుందా ?