శాండల్వుడ్లో ఇటీవల థియేటర్ల లో విడుదల అయిన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. రిషబ్ శెట్టి హీరోగా నటించడం మాత్రమే కాకుండా రచించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు మరో రికార్డ్ ను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. అతి తక్కువ బడ్జెట్తో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన కాంతార చిత్రం కర్ణాటకలోని హోంబలే ఫిల్మ్స్లో అత్యధికంగా వీక్షించిన చిత్రంగా నిలిచింది. అంటే, ఇది యష్ యొక్క కేజీఎఫ్ చాప్టర్ 2 ద్వారా సృష్టించబడిన అత్యధిక ఫుట్ఫాల్స్ రికార్డ్ను కూడా అధిగమించింది.
తెలుగు రాష్ట్రాల్లో విడుదలైనప్పటి నుంచి కాంతార కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందించిన ఈ బ్లాక్బస్టర్ చిత్రంలో సప్తమి గౌడ, కిషోర్ కుమార్ మరియు ఇతరులు కూడా ఉన్నారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి రికార్డ్ లను నెలకొల్పుతుందో చూడాలి.