ఆలస్యం అవుతుందని ఆటోలో వచ్చిన ‘చినబాబు’ !

ఆలస్యం అవుతుందని ఆటోలో వచ్చిన ‘చినబాబు’ !

Published on Jul 16, 2018 11:33 PM IST

తమిళ హీరో కార్తీ , సయేషా జంటగా తమిళ భాషలో నటించిన చిత్రం ‘కడైకుట్టి సింగం’. ఈచిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకం ఫై మిర్యాల రవీందర్ రెడ్డి ‘చినబాబు’ పేరుతో తెలుగులో విడుదల చేశారు. తమిళ,తెలుగు భాషల్లో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రివ్యూస్ ను సొంతం చేసుకొని విజయం దిశగా పయనిస్తుంది .

ఇక తెలుగులో ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో కొద్దీ సేపటి క్రితం ఈ చిత్రం యొక్క సక్సెస్ మీట్ ను ప్రసాద్ ల్యాబ్ లో ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు హైద్రాబాద్లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ట్రాఫిక్ జాం కావడం వలన ఆలస్యం అవుతుందని ఈ మీటింగ్ కి ఆటో లో వచ్చారు హీరో కార్తీ ఆయనతో పాటు నిర్మాత రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు.

రైతు పాత్రలో కార్తీ నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచింది. ఇక ఈ చిత్ర ఒరిజినల్ వెర్షన్ ను కార్తీ అన్నయ్య స్టార్ హీరో సూర్య నిర్మించారు . ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సత్యరాజ్ ముఖ్య పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు