రజత్ రవిశంకర్ దర్శకత్వంలో కార్తీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవ్’. తాజాగా ఈ సినిమా టీజర్ ను నవంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నామని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా కి హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.
కాగా ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకోగా, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ డ్రామా గా వస్తున్న ఈ సినిమా ని డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.