చాలా రోజల తరువాత తమిళ సినిమా కు సైన్ చేసిన కీర్తి !

చాలా రోజల తరువాత తమిళ సినిమా కు సైన్ చేసిన కీర్తి !

Published on May 9, 2019 1:36 PM IST

రైజింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో అలాగే హిందీలో ఓ చిత్రం లో నటిస్తూ బిజీగా వుంది . అందులో భాగంగా ప్రస్తుతం తెలుగులో నరేంద్ర డైరెక్షన్ లో ఓ లేడీ ఓరియెంట్డ్ మూవీ లో నటిస్తుండగా నగేష్ కుకునూరు డైరెక్షన్లో ఓ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తుంది. వీటితోపాటు హిందీలో అజయ్ దేవగన్ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా సర్కార్ తరువాత కోలీవుడ్ లో చాలా రోజుల తరువాత మరో సినిమాకు ఓకే చెప్పిందట కీర్తి.

ఓ నూతన దర్శకుడు డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు నిర్మించనున్నాడు . ఇది కూడా లేడీ ఓరియేంటేడ్ మూవీ నే కావడం విశేషం. త్వరలోనే ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు