అల్లు అర్జున్ ను ఆహ్వానించినా ముఖ్యమంత్రి !

అల్లు అర్జున్ ను ఆహ్వానించినా ముఖ్యమంత్రి !

Published on Nov 6, 2018 12:51 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను కేరళ లో నవంబర్ 10న జరిగే 66వ నెహ్రూ ట్రోపీ బోటు రేస్ లకు ముఖ్య అతిధిగా రావాలని కోరారు అక్కడి ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఈమేరకు అక్కడి ప్రభత్వం తరుపున బన్నీ కి ఆహ్వానం అందింది.

కేరళ ప్రభత్వం ప్రతి సంవత్సరం ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దాదాపుగా 2లక్షల మంది ఈ పోటీలను తిలకించడానికి వస్తారు. ఇక అల్లు అర్జున్ కు కేరళ లోకూడా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన ప్రతి సినిమా అక్కడ విడుదలవుతుంది. దాంతో కేరళ ఫై బన్నీ కి ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఇటీవల అక్కడ వరదలు సంభవించినప్పుడు బన్నీ 25లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు