ఆగస్ట్ 13 నుండి ఆది సాయి కుమార్ “కిరాతక” షూటింగ్!

ఆగస్ట్ 13 నుండి ఆది సాయి కుమార్ “కిరాతక” షూటింగ్!

Published on Jul 29, 2021 2:00 PM IST

ఎం. వీరభద్రమ్ దర్శకత్వం లో ఆది సాయి కుమార్ హీరోగా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా రానున్న సరికొత్త చిత్రం కిరాతక. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 13 వ తేదీ నుండి షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది.

డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న‌ఈ మూవీని విజ‌న్ సినిమాస్‌ ప‌తాకంపై ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హీరోయిన్ పూర్ణ ఒక ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే దాస‌రి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు.

నిర్మాత డా. నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ – ‘మా హీరో ఆది, ద‌ర్శ‌కుడు వీర‌భ‌ద్ర‌మ్‌ల హిట్‌ కాంబినేష‌న్‌లో ఒక ప‌ర్‌ఫెక్ట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ స‌బ్జెక్ట్‌తో వస్తోన్న చిత్ర‌మిది. మేకింగ్ ప‌రంగా ఎక్కడా కాంప్ర‌మైజ్ టెక్నిక‌ల్‌గా హైస్టాండ‌ర్స్‌లో నిర్మించ‌బోతున్నాం. ఆగ‌స్ట్‌13 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. కిరాత‌క త‌ప్ప‌కుండా క‌మ‌ర్షియ‌ల్‌గా బిగ్ సక్సెస్ సాధిస్తుందనే న‌మ్మ‌కం ఉంది’ అన్నారు.

ద‌ర్శ‌కుడు ఎం.వీర‌భ‌ద్రమ్ మాట్లాడుతూ – ‘ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ పూర్త‌య్యింది. కిరాత‌క టైటిల్‌తో పాటు ఆది సాయికుమార్‌, పాయ‌ల్ రాజ్‌పూత్ కాంబినేష‌న్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది. పూర్ణ, దాస‌రి అరుణ్ కుమార్, దేవ్‌గిల్ తో పాటు మ‌రికొంత‌మంది ఫేమ‌స్ ఆర్టిస్టులు న‌టిస్తున్నారు వారి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు