సీనియర్ హీరో కేంద్ర మాజీ మంత్రి రెబల్ స్టార్ కృష్ణంరాజు కొంతకాలంగా తీవ్రమైన నిమోనియాతో బాధపడుతూ ఆయన నిన్న అస్వస్థతకు గురయ్యారు. కాగా ఆయనను నిన్న రాత్రి కుటుంబ సభ్యులు బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్యులు ఆయన్ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
కాగా కృష్ణరాజుకు చికిత్స అందిస్తోన్న వైద్యులు మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కృష్ణంరాజుగారి ఆరోగ్యం స్థిరంగా ఉందని.. ఆయన పూర్తిగా కోలుకుని త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.