“క్షణక్షణం” మూవీ క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా కూర్చోబెడుతుంది – హీరో ఉదయ్ శంకర్

“క్షణక్షణం” మూవీ క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా కూర్చోబెడుతుంది – హీరో ఉదయ్ శంకర్

Published on Feb 25, 2021 8:12 PM IST


యంగ్ హీరో ఉదయ్ శంకర్ హీరోగా నటించిన కొత్త సినిమా “క్షణక్షణం” రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జియా శర్మ నాయికగా, కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో మన మూవీస్ బ్యానర్‌లో డాక్టర్ వర్లు “క్షణక్షణం” చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నటించిన అనుభవాలను హీరో ఉదయ్ శంకర్ మీడియాతో పంచుకున్నారు.

నేను గతంలో “ఆటగదరా శివ”, “మిస్ మ్యాచ్” రెండు సినిమాలలో హీరోగా చేశానని, ఓటీటీలో రిలీజైన ఆటగదరా శివ చిత్రానికి మంచి ఆదరణ దక్కిందని, ఈ సినిమాకు అత్యధిక వ్యూయింగ్ వచ్చినట్లు ఈ మధ్య బన్నీ వాస్ గారు చెప్పారమి అన్నారు. ఇప్పుడు నా మూడో చిత్రంగా క్షణక్షణం చేశానని ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుందని అన్నారు.

ఈ సినిమా ప్రమోషన్ బాగా చేస్తున్నామని, థియేటర్లకు ప్రేక్షకులు రావాలి లేకపోతే ఒక మంచి సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుందని అన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో థియేటర్లు ఎక్కువగా దొరకడంలేదని అయినా గీతా ఫిలింస్ వారు వీలైనంత ఎక్కువ థియేటర్లు ఇస్తున్నారని, నా జీవితంలో జరిగిన ఘటనలు కొన్ని ఈ కథలో రిలేట్ అయ్యాయని, హీరో క్యారెక్టరైజేషన్ నా జీవితంతో పోల్చుకున్నానని, నాకే కాదు చాలా మందికి ఇలా జరుగుతుంటాయని, ఇంట్లో, బయటా రిజెక్షన్స్ వస్తుంటాయి. నా జీవితంలో పది పదిహేనేళ్లుగా ఇలాంటివే జరుగుతున్నాయని అందుకే నేను అలా నటించేందుకు పెద్దగా కష్టపడలేదని, నాకు సహజంగానే అనిపించిందని ఉదయ్ శంకర్ అన్నారు.

క్షణక్షణం టైటిల్‌ను బజ్ కోసం పెట్టలేదని, చూడగానే క్యాచీ టైటిల్ అని పెట్టానని దర్శకుడు చెప్పాడని, క్షణక్షణం టైటిల్ కథకు యాప్ట్. వెంకటేష్ గారి క్షణక్షణం పెద్ద హిట్ సినిమా అయ్యిందని ప్రేక్షకులకు బాగా నచ్చిన చిత్రం అది అని, మా సినిమా డార్క్ హ్యూమర్ గా ఉంటుంది. చివరి 20 నిమిషాలు ఊహించలేరు. బన్నీ వాస్ గారికి కూడా ఆ చివరి ఇరవై నిమిషాలే బాగా నచ్చింది.

మా కథలో హీరో బాధలే ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయని, కోటి గారితో ఇది నా ఫస్ట్ మూవీ అని ఆయన ఇందులో లాయర్ క్యారెక్టర్ చేశారని, ఈ క్యారెక్టర్‌కు ముందు కీరవాణి గారిని అనుకున్నామని అయితే ఆయన ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉంటారని అందుకే కోటి గారు మా టీమ్ లోకి వచ్చారని, కోటి గారు సీన్ పేపర్ తీసుకుని క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయి చేశారని, తండ్రి కోటిగారు నటిస్తుంటే రోషన్ ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం వాళ్లిద్దరికీ కొత్త ఎక్సీపిరియన్స్ అని అన్నారు.

దర్శకుడు కార్తీక్ మేడికొండ కథ చెప్పినప్పుడు, తీసింది చూసినప్పుడు ఒకే అనుభూతి వచ్చిందని, ఈ కథ అనుకున్నట్లే చేయాలి, అనుకున్నదానికంటే ఎక్కువచేసినా సమస్యే అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు మౌళి గారు వన్ ఆప్ ద ప్రొడ్యూసర్ అని, వర్లు గారు, మౌళి గారు లేకుంటే మా సినిమా షూటింగ్ అయ్యేది కాదని మాస్క్ లు, శానిటైజర్లు, పీపీఈ కిట్స్ ఇలా ప్రతి ఒక్కరికీ ఇచ్చారని, ఉన్నవారికంటే ఎక్కువే తీసుకొచ్చి పెట్టారని, క్షణక్షణం సినిమా ఆడితేనే నాకు మరో సినిమాకు హీరోగా అవకాశం వస్తుందని, నేను లెక్కల్లో జీనియస్ కానీ సినిమా లెక్కలు అస్సలు తెలియవని అన్నారు. కోటి, రఘు కుంచె, గిఫ్టన్ ఈ ముగ్గురు సంగీత దర్శకులు మా సినిమాలో నటించడం కో ఇన్సిడెంట్ అని అన్నారు.

ఈ సినిమాలో నాకు హీరోయిన్ జియా శర్మతో ఎలాంటి కెమిస్ట్రీ ఉండదని, ఆమె నా భార్య క్యారెక్టర్ చేసిందని, ఎప్పుడూ మాకు గొడవలు జరుగుతుంటాయని అన్నారు. అయితే ఒక సమస్య నుంచి బయటకు రాగానే మరో సమస్యలో హీరో పడతాడని, క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ బాగా ఆకట్టుకుంటాయని సినిమా ఫస్టాఫ్ బాగుంటుందని అన్నారు. ఇంటర్వెల్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుందని, సెకండాఫ్ నుంచి క్లైమాక్స్ దాకా ఉత్కంఠగా కొనసాగుతుందని చెప్పుకొచ్చారు.

కొత్త హీరోలు రొటీన్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూడరని, బ్యాక్ గ్రౌండ్ ఉంటే రెడీమేడ్ ఫ్యాన్స్ ఉంటారని, బయట నుంచి వచ్చి కొత్తగా ట్రై చేసే హీరోలు డిఫరెంట్ కథలు ఎంచుకోవాలని, విజయ్ సేతుపతి, ఆయుశ్మాన్ ఖురానా లాంటి వాళ్లు బాలీవుడ్ లో అదే ప్రయత్నం చేశారని, ఈ హీరో వస్తుండంటే ఏదో ఓ కొత్త కథ ఉంటుందనే పేరొస్తే చాలు అభిమానులు వస్తుంటారని, ఉదయ్ సినిమా వస్తుందంటే ఏదో కొత్త కథ తీసుకొస్తాడనే పేరు తెచ్చుకోవాలని ఉందని, కథలో ఇంపార్టెంట్స్ ఉంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేసేందుకైనా తాను సిద్ధమేనని, అయితే హీరోగా చేయాలనేది నా కోరిక. ఒక సఖి, గీతాంజలి, ఓకే బంగారం లాంటి ఫీల్ గుడ్ ప్రాపర్ లవ్ స్టోరీలో నటించాలని ఉందని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు