“డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు” తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది – డైరక్టర్ కేవీ గుహన్

“డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు” తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది – డైరక్టర్ కేవీ గుహన్

Published on Aug 24, 2021 12:55 PM IST


118 వంటి స‌క్సెస్‌ఫుల్‌ మూవీ త‌ర్వాత ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహన్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతోన్న మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ ‌డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు (ఎవ‌రు, ఎక్క‌డ‌, ఎందుకు). రామంత్ర క్రియేషన్స్ పతాకం పై ప్రొడ‌క్ష‌న్ నెం.1 గా డా. రవి మరియు పి. రాజు దాట్ల నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ భాగ‌స్వామ్యం తో థియేట‌ర్స్‌ లో గ్రాండ్‌గా విడుద‌ల‌ కానుంది. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన సాంగ్స్ విశేష ఆదరణ దక్కించుకుని సినిమా పై ఆసక్తి ను పెంచాయి.

ఈ సందర్భంగా స్టార్ ప్రొడ్యూస‌ర్ సురేష్‌బాబు మాట్లాడుతూ, రీసెంట్ గా సినిమా చూశానని తెలిపారు. క్రిస్పీ న‌రేష‌న్‌ తో మంచి పెర్‌ఫామెన్స్‌ ల‌తో చాలా థ్రిల్లింగ్ గా తెర‌కెక్కించారు అని ప్రశంసించారు. ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల్ని, ఈ క‌రోనా వ‌ల్ల వర్చువల్ వరల్డ్ లో వ‌చ్చిన మార్పుల‌ని చ‌క్క‌గా చూపించారు అంటూ చెప్పుకొచ్చారు. అంత‌ర్లీనంగా ఒక మంచి ప్రేమ‌క‌థ కూడా ఉందని, ఆడియో కి ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చిందని, డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు వంటి ఒక మంచి చిత్రాన్ని మీకు థియేటర్లలో అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని అన్నారు.

చిత్ర నిర్మాత డా. రవి పి. రాజు దాట్ల మాట్లాడుతూ, మా బేన‌ర్‌లో రూపొందిన ఫ‌స్ట్ మూవీ డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు చిత్రానికి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌కులుగా వ్యవ‌హరించ‌డం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఇది తమ ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సురేష్ బాబుగారికి తమ బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఫస్ట్‌ టైమ్ తెలుగులో వస్తోన్న కంప్యూటర్‌ స్క్రీన్‌ మూవీ ఇది అని, గుహ‌న్‌గారి మేకింగ్ చాలా కొత్త‌గా ఉంటుంది అని, అలాగే అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్ ఇద్ద‌రు సెటిల్డ్ పెర్‌ఫామెన్స్ ఇచ్చారు అని, వారిద్ద‌రి కెమిస్ట్రి త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జ‌రుగుతోన్న ఈ చిత్రం ట్రైల‌ర్ త్వరలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం ఉంది అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు కేవీ గుహన్ మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వ‌చ్చిందని, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీ విడుద‌ల‌వ‌డం నిజంగా హ్యీపీగా ఉంది అని అన్నారు. అదిత్‌, శివాణి ఇద్ద‌రు చాలా బాగా న‌టించారు, టెక్నీషియ‌న్స్ అంద‌రూ మంచి స‌పొర్ట్ అందించారు, తప్పకుండా ఒక డిఫరెంట్ మూవీ అవుతుంది అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు