కేవీకేఆర్ పతాకంపై పృథ్వీ దండమూడి హీరోగా రమేష్ కుందేటి దర్శకత్వంలో భస్వంత్ కంభంపాటి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెం-1 చిత్రం పూజా కార్యక్రమాలు లాంఛనంగా ఈ రోజు సంస్థ కార్యాలయంలో జరిగాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు మురళీమోహన్, పథ్వీ రాజ్, కృష్ణభగవాన్, శ్రీలక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు మురళీ మోహన్ హీరో పృథ్వీ దండమూడి పై క్లాప్ నిచ్చి దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం దర్శకుడు రమేష్ కుందేటి మాట్లాడుతూ, “నవంబర్ ఫస్ట్ నుంచి షెడ్యూల్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయడానికి ప్లాన్ చేశాం. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం” అని అన్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ కళ్యాణ్ బి, ఎడిటర్ తుషార పాల, ఆర్ట్ డైరక్టర్ థెరిసా స్వేచ్ఛ, కాస్ట్యూమ్ డిజైనర్ లాహిత్యరెడ్డి, సంగీతం శేఖర్ మోపూరి, పాటలు సురేష్ గంగుల, పీఆర్వో రమేష్ చందు, నిర్మాత భస్వంత్ కంభంపాటి, డైరక్టర్ రమేష్ కుందేటి లుగా వ్యవహరిస్తున్నారు.