తాండవంలో లక్ష్మి రాయ్

తాండవంలో లక్ష్మి రాయ్

Published on Apr 21, 2012 3:03 PM IST


విక్రమ్,అనుష్క లు ప్రధాన పాత్రలలో రాబోతున్న “తాండవం” చిత్రానికి మరింత అందం తోడయ్యింది. ఇప్పటికే అనుష్క మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలలో ఉన్న ఈ చిత్రంలో తాజాగా లక్ష్మి రాయ్ చేరింది. విక్రమ్ మరియు జగపతి బాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “నాన్న” చిత్ర ఫేం ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. యుటివి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది చిత్రంలో ప్రధాన భాగం చెన్నై,హైదరాబాద్ మరియు యూకేలలో చిత్రీకరిస్తున్నారు. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లక్ష్మి రాయ్ గత సంవత్సరం మంగాత(తెలుగు గ్యంబ్లర్) చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకుంది త్వరలో బాలకృష్ణ సరసన “అధినాయకుడు” చిత్రంలో కనిపించనుంది. ఈ ముగ్గురి భామలతో చిత్రం మరింత అందంగా మారనుంది. తాండవం ప్రేక్షకులకు కన్నుల పండుగ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు