విక్రమ్,అనుష్క లు ప్రధాన పాత్రలలో రాబోతున్న “తాండవం” చిత్రానికి మరింత అందం తోడయ్యింది. ఇప్పటికే అనుష్క మరియు ఏమి జాక్సన్ ప్రధాన పాత్రలలో ఉన్న ఈ చిత్రంలో తాజాగా లక్ష్మి రాయ్ చేరింది. విక్రమ్ మరియు జగపతి బాబు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. “నాన్న” చిత్ర ఫేం ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. యుటివి సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది చిత్రంలో ప్రధాన భాగం చెన్నై,హైదరాబాద్ మరియు యూకేలలో చిత్రీకరిస్తున్నారు. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు నిరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లక్ష్మి రాయ్ గత సంవత్సరం మంగాత(తెలుగు గ్యంబ్లర్) చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకుంది త్వరలో బాలకృష్ణ సరసన “అధినాయకుడు” చిత్రంలో కనిపించనుంది. ఈ ముగ్గురి భామలతో చిత్రం మరింత అందంగా మారనుంది. తాండవం ప్రేక్షకులకు కన్నుల పండుగ కానుంది.
తాండవంలో లక్ష్మి రాయ్
తాండవంలో లక్ష్మి రాయ్
Published on Apr 21, 2012 3:03 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కృష్ణమ్మ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్!
- సమీక్ష : “ఆరంభం” – ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది
- సమీక్ష : “ప్రతినిధి 2” – రొటీన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా !
- ఫోటోలు: ఐశ్వర్య రాజేష్
- ఓటిటి: ‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
- “గోట్” కోసం యూఎస్ కి దళపతి విజయ్.!
- కలెక్షన్: సోనాల్ చౌహాన్