లేటెస్ట్..”జిగర్ తండ” డబుల్ ఎక్స్ ఓటిటి డేట్ ఫిక్స్.!

లేటెస్ట్..”జిగర్ తండ” డబుల్ ఎక్స్ ఓటిటి డేట్ ఫిక్స్.!

Published on Dec 1, 2023 10:08 AM IST

కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకులు మరియు నటులు అయినటువంటి రాఘవ లారెన్స్ మరియు ఎస్ జె సూర్యల కలయికలో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “జిగర్ తండ డబుల్ ఎక్స్”. మరి తమిళ్ సహా తెలుగులో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. మరి ఇప్పటికి థియేట్రికల్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఇప్పుడు ఓటిటి రిలీజ్ కి వచ్చేందుకు సిద్ధం అవుతుంది.

మరి ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో అయితే ఈ డిసెంబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అంతే కాకుండా మరో సర్ప్రైజింగ్ గా అతి త్వరలోనే ఇంగ్లీష్ వెర్షన్ లో కూడా ఈ సినిమాని విడుదల చేస్తామని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు