‘సాహో’ చిత్ర టీమ్ నుంచి సరికొత్త అప్డేట్ !

‘సాహో’ చిత్ర టీమ్ నుంచి సరికొత్త అప్డేట్ !

Published on Jun 30, 2018 10:52 AM IST

ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ కొద్దిరోజుల క్రితమే క్లిష్టమైన, అతి ముఖ్యమైన దుబాయ్ షెడ్యూల్ ను ముగించుకున్న సంగతి తెలిసిందే. రూ.90 కోట్ల భారీ వ్యయంతో జరిపిన ఈ దుబాయ్ చిత్రీకరణలో హెవీ ఛేజింగ్ సన్నివేశాలను షూట్ చేశారు. స్టంట్ కొరియోగ్రఫర్ కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో ఈ చిత్రీకరణ జరిగింది.

ఇక 3వ షెడ్యూల్ ను చిత్ర యూనిట్ జూలై 11న హైదరాబాద్ లో మొదలుపెట్టనుంది. ఇందులో చిత్రంలోని ప్రముఖ తారాగణం పాల్గొననున్నారు. సుజీత్ సింగ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో శ్రద్దా కపూర్ హీరోయిన్ కాగా పలువురు బాలీవుడ్ నటీ నటులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్దా కపూర్ హీరోయిన్ కాగా పలువురు బాలీవుడ్ నటి నటులు కీలక పాత్రలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు