‘అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడ్ లో ఓ ట్రెండ్ ను సెట్ చేసి.. అదే బోల్డ్ సినిమాని హిందీలో కూడా చేసి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు యంగ్ డైరెక్టర్ సందీప్ వంగ. కాగా సందీప్ తన కొత్త సినిమా ‘యానిమల్’ ని బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశాడట సందీప్. ఆ సాంగ్ లో సౌత్ యంగ్ బ్యూటీ కృతి శెట్టిని తీసుకోవాలని ‘యానిమల్’ టీమ్ ప్లాన్ చేస్తుంది.
మరి స్పెషల్ సాంగ్ చేయడానికి కృతి శెట్టి ఒప్పుకుంటుందో ? లేదో చూడాలి. కాగా మనుషుల్లో మారుతున్న స్వభావాల చుట్టూ సాగే కథ ఇది. మనిషి జంతువులా మారితే ? ఈ కోణంలో ఈ ‘యానిమల్’ సాగనుంది. సిద్ధార్థ్ గరిమ మాటలు సమకూర్చగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. టీ సిరీస్ భూషణ్ కుమార్, భద్రకాళీ పిక్చర్స్, సినీ స్టూడియోస్ వన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.