‘సర్కారు వారి పాట’లో కన్ ఫ్యూజన్ డ్రామా !

‘సర్కారు వారి పాట’లో కన్ ఫ్యూజన్ డ్రామా !

Published on Apr 27, 2021 3:00 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో పరశురామ్ డీసెంట్ కామెడీ ట్రాక్ ను రాశాడని, సప్తగిరి, ప్రియదర్శి మధ్య సాగే ఈ కామెడీ ట్రాక్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. ఈ ట్రాక్ మొత్తం సెకెండ్ హాఫ్ లో వస్తోందట. అలాగే ఈ ట్రాక్ లో అనసూయ కూడా ఉంటుందట. వీళ్ళ ముగ్గురి మధ్య ఫుల్ కన్ ఫ్యూజన్ డ్రామా చాల బాగుంటుందట.

కాగా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. సినిమాలో హీరో ఫాదర్ పాత్ర బ్యాంకు ఉన్నత అధికారి అని తెలుస్తోంది. తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఈ క్రమంలో మహేష్ వేసే ప్లాన్స్ ఏమిటి అనే అంశాల చుట్టూ సినిమా నడుస్తోందని తెలుస్తోంది.

అంటే మహేష్ వేసే ప్లాన్స్ చుట్టూ వచ్చే సీన్స్ ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటాయట. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, 14 రీల్స్ ప్లస్, బ్యానర్స్ తో పాటు మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా నటించనున్నాడు. ఇక మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు