‘మహర్షి’ దర్శకుడికి మహేష్ స్పెషల్ విషెస్.

‘మహర్షి’ దర్శకుడికి మహేష్ స్పెషల్ విషెస్.

Published on Jul 27, 2019 1:08 PM IST

ప్రిన్స్ మహేష్ డైరెక్టర్ వంశీ పైడిపల్లికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు, ఆయన భవిష్యత్ బాగుండాలని ఆకాక్షించారు. గత రాత్రి జరిగిన వంశీ పైడిపల్లి జన్మదిన వేడుకలలో మహేష్ పాల్గొన్నట్లు తెలుస్తుంది. తాజాగా వంశీ పైడిపల్లి మహేష్ కి “మహర్షి” లాంటి సూపర్ హిట్ మూవీని ఇవ్వడం జరిగింది.విడుదలైన అన్ని చోట్లా రికార్డు కలెక్షన్స్ సాధించిన “మహర్షి” మూవీ నైజాంలో అంచనాలకు మించిన వసూళ్లు సాధించింది. ఈ మూవీ తరువాత మహేష్, వంశీ చాలా సన్నిహితంగా ఉంటున్నారు.

1978 జులై 27న జన్మించిన వంశీ పైడిపల్లి సినిమాలపై మక్కువతో సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినీ రంగ ప్రవేశం చేశారు. కెరీర్ ప్రారంభంలో ఈశ్వర్,వర్షం,మాస్ ,భద్ర సినిమాలకు అసిస్టెంట్,అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేయడం జరిగింది. 2007లో ప్రభాస్ హీరోగా వచ్చిన “మున్నా” సినిమాతో దర్శకుడిగా అవకాశం దక్కించుకున్నాడు. ఆ తరువాత ఎన్టీఆర్ హీరోగా బృదావనం చిత్రం తీసి హిట్ అందుకున్నాడు. రామ్ చరణ్ తో ‘ఎవడు’, నాగార్జున,కార్తీ హీరోలుగా ‘ఊపిరి’ వంటి చిత్రాలు తీశారు. ‘మహర్షి’ మూవీ తన లేటెస్ట్ చిత్రం.

కెరీర్ ప్రారంభం నుండి వంశీ స్టార్ హీరోలతోనే సినిమాలు చేశారు. డైరెక్టర్ గా పన్నెండేళ్ల కెరీర్ లో వంశీ తీసింది కేవలం ఐదు చిత్రాలే. ప్రతి సినిమా విడుదల తరువాత ఈ దర్శకుడు రెండు నుండి మూడేళ్ళ విరామం తీసుకుంటున్నాడు. ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ తరువాత కూడా ఈ దర్శకుడు మరో సినిమాకు సంబందించిన ప్రకటన చేయకపోవడం ఇందుకు నిదర్శనం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు