సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. సౌతిండియన్ టాప్ డైరెక్టర్స్లో ఒకరైన ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్ గత నెలరోజులుగా హైద్రాబాద్లో జరుగుతూ వస్తోంది. ఇక నిన్నటితో టీమ్ ఈ షెడ్యూల్ను పూర్తి చేసేసింది. ఈ షెడ్యూల్లో మహేష్తో పాటు హీరోయిన్ రకుల్, విలన్ ఎస్.జె.సూర్య తదితరులు పాల్గొనగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఇక ఫిబ్రవరి 11 నుంచి ముంబైలో ఓ షెడ్యూల్ మొదలుపెట్టనున్న టీమ్, ముంబై, పూణే, డయ్యూ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరిపి టాకీపార్ట్ను పూర్తి చేయనుంది. మే నెలలో చెన్నై, హైద్రాబాద్లలో భారీ ఎత్తున ఆడియో ఫంక్షన్ నిర్వహించేలా టీమ్ ప్లాన్ చేస్తోంది. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు భారీ బడ్జెట్తో నిర్మిస్తోన్న ఈ సినిమా జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.