జూన్ లో విడుదల కానున్న మళ్ళీ మళ్ళీ చూశా

జూన్ లో విడుదల కానున్న మళ్ళీ మళ్ళీ చూశా

Published on May 18, 2019 12:00 PM IST

అనురాగ్ కొణిదెన హీరోగా శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరోయిన్లు గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో క్రిషి క్రియేషన్స్ పతాకంపై కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం “మళ్ళీ మళ్ళీ చూశా”.. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది..

ఈ సందర్భంగా దర్శకుడు హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ లేని జీవితం అంటే శత్రువు లేని యుద్ధం లాంటిది. ఈ సమాజంలోని ప్రతి ప్రేమికుడు, సమరంలో ఒక సైనికుడితో సమానం. స్వచ్ఛమైన ప్రేమను ఆ ప్రేమే గెలిపించుకుంటుంది. శత్రువులు లేని యుద్ధంలో స్వేచ్ఛగా ప్రేమను గెలిచిన సైనికుడులాంటి ఓ సామాన్యుడి ప్రేమకథ “మళ్ళీ మళ్ళీ చూశా” అని అన్నారు.

నిర్మాత కె. కోటేశ్వరరావు మాట్లాడుతూ… ఒక మంచి పుస్తకం, ఒక మంచి స్నేహితుడితో సమానం. మా సినిమా కూడా చూసినోళ్లందరికి ఒక మంచి ఫ్రెండ్ అవుతుంది. జీవితం సంతోషంగా ఉండాలంటే మన ఆలోచనలు అందంగా ఉండాలి. అలాంటి అందమైన ఆలోచనల సమూహమే మా సినిమా. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించుకుని త్వరలో ఆడియో, జూన్ ప్రథమార్థంలో సినిమా విడుదల చేయబోతున్నాం అన్నారు..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు