‘మనం సైతం’ రథ సారధి చేతుల మీదుగా ప్రారంభమైన కొత్త చిత్రం !

‘మనం సైతం’ రథ సారధి చేతుల మీదుగా ప్రారంభమైన కొత్త చిత్రం !

Published on Oct 20, 2018 11:14 PM IST

గజపతి శ్రీనివాస్ దర్శకత్వంలో డి.ఎస్. రెడ్డి నిర్మాణ సారథ్యంలో ప్రాఘ్నేయ ఆర్ట్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర ప్రారంభం హైదరాబాద్‌ లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ‘మనం సైతం’ కాదంబరి కిరణ్ క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు గజపతి శ్రీనివాస్, సర్లాన రాంబాబు, సన్ మీడియా సీఈఓ గంటా స్వామి, చిత్ర హీరోయిన్ షహరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు గజపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్రాన్ని ప్రారంభించి, మమ్మల్ని ఆశీర్వదించిన కాదంబరి కిరణ్ కుమార్‌ గారికి కృతజ్ఞతలు. నూతన నటీనటులతో పాటు సీనియర్ నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు. ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. సంగీతానికి ప్రాధాన్యమున్న చిత్రమిది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. పూర్తి వివరాలను అతి త్వరలో తెలియజేయనున్నాము..’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: తలారి శ్రీనివాస్, డిఓపి: యలమంచిన ఈశ్వర్, డైలాగ్స్: అనిల్.కె, నిర్మాణం: డి.ఎస్.రెడ్డి, కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: గజపతి శ్రీనివాస్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు