మణిరత్నం మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన పాపులర్ సింగర్.

మణిరత్నం మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారిన పాపులర్ సింగర్.

Published on Jul 10, 2019 12:02 AM IST

ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ బ్యానర్ పై విక్రమ్ ప్రభు,జివి ప్రకాష్,ఐశ్వర్య రాజేష్,మడోన్నా సెబాస్టియన్ ప్రధాన పాత్రలలో “వానమ్ కొట్టాటం”అనే చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. మని రత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ధనశేఖరన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.

ఈ మూవీ సంగీత దర్శకుని విషయంలో ఓ ఆసక్తికర వార్త బయటికొచ్చింది. అదేంటంటే ప్రస్తుతం సూపర్ హిట్ సాంగ్స్ తో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న సింగర్ సిద్ శ్రీరామ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మారి స్వరాలు అందించనున్నారట. నిజానికి ఈ చిత్రానికి మొదట సంగీత దర్శకుడిగా ’96’ మూవీ ఫేమ్ గోవింద వసంత ను తీసుకున్నారట. ఐతే కారణాలేమైనా కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో స్వరాలు సమకూర్చే బాధ్యతలు సిద్ శ్రీరామ్ కి అప్పగించారని వినికిడి. ఇప్పటివరకు ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ ట్యూన్స్ కి తన గొంతుతో ప్రాణం పోసిన శ్రీరాం తన సొంత ట్యూన్స్ ని ఇంకెంత బాగా పాడతాడో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు