మన ఇండస్ట్రీ టాలెంట్, క్రియేటివిటీ కి “నవరస” నిదర్శనంగా నిలవనుంది – మణిరత్నం

మన ఇండస్ట్రీ టాలెంట్, క్రియేటివిటీ కి “నవరస” నిదర్శనంగా నిలవనుంది – మణిరత్నం

Published on Jul 9, 2021 11:38 AM IST

తొమ్మిది క‌థ‌ల స‌మాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అంద‌రిలో ఆస‌క్తి క‌లిగించిన అంథాల‌జీ న‌వ‌ర‌స‌ వెబ్ సిరీస్. ఏస్ డైరెక్టర్‌ మ‌ణిర‌త్నంతో పాటు ప్రముఖ రైట‌ర్, ఫిల్మ్ మేక‌ర్ జ‌యేందర్‌ పంచ‌ప‌కేశ‌న్ స‌మ‌ర్పణలో ఈ అంథాల‌జీ వెబ్ సిరీస్ రూపొందింది. మాన‌వ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని న‌వ‌ర‌సాలు అని కూడా అంటాం. కోపం, ధైర్యం, క‌రుణ‌, అస‌హ్యం, భ‌యం, వినోదం, ప్రేమ‌, శాంతి, ఆశ్చ‌ర్య‌పోవ‌డం వీటి ఆధారంగా న‌వ‌ర‌స‌ రూపొందింది. ప్రముఖ డిజిట‌ల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ అంథాల‌జీని ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో ఆగ‌స్ట్ 6న విడుద‌లచేస్తోంది. అయితే దీని కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ నవరస అంథాలజీ సినీ రంగానికి సంబంధించిన సాంస్కృతిక గర్వకారణంగానూ, అద్భుతంగా, మైలురాయిగా నిలవనుంది. అందుకు కారణం అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఈ అంథాలజీ రూపకల్పన కోసం ముందుకు రావడమే. టాప్‌ మోస్ట్‌ నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు, నిర్మాతలు ఇతర సాంకేతిక నిపుణుల కలిసి ఈ అంథాలజీకి జీవం పోయడమే కాకుండా సాటిలేని ఓ కలను సాకారం చేశారు అని చెప్పాలి. తమిళ సినిమా రంగంలోని అద్భుతమైన సృజనాత్మకతను కలిగిన వారందరూ ఈ సినిమాకు పనిచేశారు. కొవిడ్‌ సమయంలో ఇబ్బందులు పడ్డ సినీ పరిశ్రమలోని కార్మికుల శ్రేయస్సు కోసం ఈ వెబ్ సిరీస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వినియోగించనున్నారు. ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న తొమ్మిది మంది స్టార్స్‌తో అరవింద్ స్వామి, బెజోయ్ నంబియార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, కార్తీక్ నరేన్, కార్తీక్ సుబ్బరాజ్, ప్రియదర్శన్, రతీంద్రన్ ప్రసాద్, సర్జున్ మరియు వసంత సాయి దర్శకులుగా తిరుగులేని విజన్‌తో నవరస లోని ప్రతి రసాన్ని రూపొందించారు.

ఈ సందర్భంగా మణిరత్నం, జయేంద్ర పంచపకేశన్‌ మాట్లాడుతూ పాండమిక్‌ నేపథ్యంలో నిధుల సమీకరణ చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాం అని అన్నారు. ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం, కొవిడ్‌ పరిస్థితుల్లో సినీ పరిశ్రమ చాలా ఘోరంగా దెబ్బతింది అని, ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమలోని కార్మికుల కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాం అని అన్నారు. అలాంటి బలమైన కోరికలో నుంచి నవరస పుట్టింది అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఆలోచనను ఇండస్ట్రీలోని ఇతర నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు తెలియజేశాం అని అన్నారు. అందరూ వెంటనే తమ సుముఖతను తెలియజేశారు అని అన్నారు. కొవిడ్‌ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది. మా టీమ్స్‌లో సభ్యులందరూ చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నారు అని, కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఈ అంథాలజీలోని తొమ్మిది భాగాలను విజయవంతంగా పూర్తి చేశాం అని వెల్లడించారు. ఇండస్ట్రీ కోసం ప్యాషన్‌, కమిట్‌మెంట్‌తో మేం చేసిన ఈ ప్రయత్నాన్ని 190 దేశాల్లోని ఆడియెన్స్‌ వీక్షించనున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్స్ కోసం అందరూ మనసు పెట్టి కష్టపడ్డారు. అందరికీ గర్వకారణంగా నిలిచిన ఈ అంథాలజీ విషయాన్ని రివీల్‌ చేయడానికి చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఉన్నాం. మన ఇండస్ట్రీ టాలెంట్‌, క్రియేటివిటీకి నవరస నిదర్శనంగా నిలవనుంది అంటూ చెప్పుకొచ్చారు. 12,000 మంది సహోద్యోగులకు దీని ద్వారా సహకారాన్ని అందించబోతున్నాం అని అన్నారు. భూమిక ట్రస్ట్‌ ద్వారా మేం చేయనున్న ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి అద్భుతమైన మద్దతు లభించింది అని అన్నారు. ఈ భావోద్వేగ ప్రయాణంలో భాగమైన నెట్‌ఫ్లిక్స్‌ సంస్థకు ఈ సందర్భంగా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం అని అన్నారు.

అయితే ఈ తొమ్మిది కథల సమాహారంగా రూపొందించబడ్డ నవరస టీజర్‌ను భరత్‌ బాలా రూపొందించారు. మనలోని భావోద్వేగాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నవరస లో ఎదిరి(కరుణ) మొదటి టైటిల్ కాగా, దీనికి బిజోయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్‌ సేతుపతి, ప్రకాశ్‌రాజ్‌, రేవతి కీలక పాత్రల్లో నటించారు. మరొక టైటిల్ ఆఫ్ సమ్మర్‌ ఆఫ్‌ 92(హాస్యం), దీనికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించగా యోగిబాబు, రమ్య నంబీశన్‌, నెడుమూడి వేణు కీలక పాత్రల్లో నటించారు.

ప్రాజెక్ట్ ఆగ్ని (ఆశ్యర్యం) గా తెరకెక్కిన దీనికి కార్తిక్‌ నరేన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో అరవింద్ స్వామి, ప్రసన్న, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు. జుగుప్స రసం గా తెరకెక్కిన పాయాసం కి వసంత్‌ ఎస్‌ సాయి దర్శకత్వం వహించారు. ఇందులో డిల్లీ గణేశ్‌, రోహిణి, అదితి బాలన్‌, సెల్ఫీ కార్తీక్ కీలక పాత్రల్లో నటించారు. శాంతి రసం గా తెరకెక్కిన పీస్‌ కి కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహించగా సింహ, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, మాస్టర్‌ తరుణ్‌ లు కీలక పాత్రల్లో నటించారు. కోపం రసంగా తెరకెక్కిన రౌద్రం కి అరవింద్‌ సామి దర్శకత్వం వహించగా రిత్విక, శ్రీరామ్‌, అభినయ శ్రీ, రమేశ్‌ తిలక్‌, గీతా కైలాసం కీలక పాత్రల్లో నటించారు.భయం రసంగా తెరకెక్కిన ఇన్మయ్‌ కి రతింద్రన్ ఆర్. ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఇందులో సిద్ధార్థ్‌, పార్వతీ తిరువోతు కీలక పాత్రల్లో నటించారు. ధైర్యం గా తెరకెక్కిన తునింత పిన్‌ కి ఎస్‌ ఆర్జున్‌ దర్శకత్వం వహించారు. ఇందులో అథర్వ, అంజలి, కిశోర్‌ ప్రధాన పాత్రలుగా నటించారు. ప్రేమ రసం గా తెరకెక్కిన గిటార్‌ కంబి మేల్‌ నిండ్రు కి గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వం వహించగా సూర్య, ప్రయాగ రోస్‌ మార్టిన్‌ కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు