మణిరత్నం అంటే ప్రతి పరిశ్రమలోనూ ఒక రెస్పెక్ట్, ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేసే ఆయన ఈసారి ఓటీటీ ద్వారా ప్రయోగం చేస్తున్నారు. తొమ్మిది మంది దర్శకులు, తొమ్మిదిమంది నటులతో తొమ్మిది కథలను తీసుకుని వెబ్ సిరీస్ చేస్తున్నారు ఆయన. ఈ వెబ్ సిరీస్ కు ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో ఈ సిరీస్ ఉండనుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ ను ఆగష్టు నెలలో రిలీజ్ చేయనున్నారు. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.
హాస్యం, భయనకం, శృంగారం, రౌద్రం లాంటి తొమ్మిది రసాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్లో ఉండే తొమ్మిది కథలు రూపొందుతున్నాయి. కేవీ ఆనంద్, గౌతమ్ మీనన్, కార్తిక్ సుబ్బరాజ్, పొన్రామ్, హలిత షలీమ్, కార్తీక్ నరేన్, రతీంద్రన్, బిజో నంబియార్, అరవింద్ స్వామి, సిద్దార్థ్ తొమ్మిది ఎపిసోడ్లకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ తొమ్మిది కథల్లో రేవతి, సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ, అరవిందస్వామి, నిత్యామీనన్, ఐశ్వర్యారాజేష్, రిత్విక, పూర్ణ, ప్రకాశ్రాజ్, బాబీసింహ, జై, స్నేహ లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఏ. ఆర్ రెహమాన్, గోవింద్ వసంతన్, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.