సెన్సార్ చేయించుకున్న `మ‌న్మ‌థుడు 2` !

సెన్సార్ చేయించుకున్న `మ‌న్మ‌థుడు 2` !

Published on Aug 6, 2019 3:13 PM IST

రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కత్వంలో కింగ్ నాగార్జున హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌ గా న‌టిస్తోన్న చిత్రం `మ‌న్మ‌థుడు 2`. రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్ రాబోతున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U/A ‘ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో నాగార్జున క్యారెక్టర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ గా ఉంటుందని.. సినిమా మొత్తంలో నాగ్ కామెడీనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాల పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్ (జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్, సినిమాటోగ్రఫీ: ఎం సుకుమార్, స్క్రీన్ ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు