ప్రతిరోజూ పండుగే మూవీ కథ ఏమిటంటే…!

ప్రతిరోజూ పండుగే మూవీ కథ ఏమిటంటే…!

Published on Nov 19, 2019 1:32 PM IST

సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రతిరోజూ పండుగే’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ చిత్రం నుండి ‘ఓ బావా…’ అనే ఓ వీడియో సాంగ్ విడుదల చేయగా విశేష స్పందన అందుకుంది. ప్రతిరోజూ పండుగే డిసెంబర్22న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. ఈసంధర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

కార్యక్రమంలో మాట్లాడిన దర్శకుడు మారుతీ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. టైటిల్, పోస్టర్స్ చూసిన వెంటనే చాలా మంది ఈ మూవీని అనేక ఫ్యామిలీ చిత్రాలతో పోల్చారని, కానీ ఈ మూవీ కంప్లీట్ గా ఓ కొత్త పాయింట్ తో తెరకెక్కుతుంది అని చెప్పుకొచ్చారు. కుటుంబంలో ఒకరు పుడితే ఎలా ఆనందంగా ఆహ్వానిస్తున్నామో, పెద్దవారి చివరిరోజులలో అంతే ఆనందంగా వారికి అద్భుతమైన వీడ్కోలు చెప్పాలి అనే పాయింట్ మీద ఈ చిత్రం నడుస్తుంది. అలాగే పిల్లలు పెద్దవారైన తరువాత వారి ప్రేమను పిల్లల పైకి మళ్లించి, కన్నవారికి ప్రేమ పంచడం మరిచిపోతున్నారు, ఆ పాయింట్ కూడా ఈ మూవీలో టచ్ చేశాం అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు