నిర్మాత మృతి కి సంతాపం తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి !

నిర్మాత మృతి కి సంతాపం తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి !

Published on Oct 27, 2018 12:57 PM IST

ప్రముఖ నిర్మాత , కామాక్షి మూవీస్ అధినేత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి ఈరోజు ఉదయం 6:30 గంటలకు అనారోగ్యంతో కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి కి మెగాస్టార్ చిరంజీవి సతాపo తెలియజేసారు. శివ‌ప్ర‌సాద్ రెడ్డి మరణ వార్త తెలియగానే ఆయన కుమారుడు చందన్ తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ డి.శివ ప్ర‌సాద్ రెడ్డి నాతో ‘ముఠా మేస్త్రి’ చిత్రాన్ని నిర్మించాడు. ఆయన సాత్వికుడు ,నాకు మంచి మిత్రుడు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు