ప్రధాని మోడీకి మాతృ వియోగం..విచారం వ్యక్తం చేసిన చిరు.!

ప్రధాని మోడీకి మాతృ వియోగం..విచారం వ్యక్తం చేసిన చిరు.!

Published on Dec 30, 2022 10:00 AM IST

ఈ ఏడాది ఒక్క టాలీవుడ్ ప్రముఖుల్లోనే కాకుండా స్పోర్ట్స్ సహా పాలిటిక్స్ ప్రముఖులలో కూడా విషాద ఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ఈరోజు అయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి హీరాబా మోడీ ఆమె తన తుది శ్వాస విడిచిన వార్త దేశ వ్యాప్తంగా విషాదంగా మారింది. మరి కొన్ని రోజులు కితమే హీరాబా గారు ఆసుపత్రిలో అడ్మిట్ కాగా ఈరోజు కన్ను మూసినట్టుగా మోడీ వ్యక్తం చేశారు.

మరి ఈ విషాద ఘటనపై మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మాతృమూర్తి ఇక లేరు అనే వార్త విని చాలా బాధపడ్డాను అని ఆమె అద్భుతమైన జీవితాన్ని చూసారు వారి పవిత్ర ఆత్మకి నా నివాళులు అర్పిస్తున్నాను. శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయ పూర్వక సానుభూతిని వ్యక్తం చేస్తున్నాని” చిరు అయితే ట్వీట్ ద్వారా తెలిపారు. మరి మోడీ మాతృ మూర్తి గారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మా 123తెలుగు.కామ్ ఆకాంక్షిస్తుంది. ఓం శాంతి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు