ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మైఖేల్”.!

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “మైఖేల్”.!

Published on Feb 24, 2023 8:00 AM IST


మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడైన సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “మైఖేల్”. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం అయితే థియేట్రికల్ గా అనుకున్న రేంజ్ లో అయితే రాణించలేకపోయింది. దీనితో కాస్త త్వరగానే మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటిటి లో తీసుకొచ్చేసారు. మరి ఈ సినిమా తెలుగు మరియు తమిళ్ స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు ప్లాట్ ఫామ్ “ఆహా” వారు సొంతం చేసుకోగా ఫైనల్ గా ఈరోజు నుంచి ఈ చిత్రం ఓటిటి లో వచ్చేసింది.

మరి అప్పుడు మిస్ అయ్యినవారు అంతా ఇప్పుడు ఈ సినిమాని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటించగా వరుణ్ సందేశ్ ఓ నెగిటివ్ రోల్ లో నటించాడు. అలాగే సామ్ సి ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రంజిత్ జేయకొడి దర్శకత్వం వహించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు