SSMB 29 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించిన కీరవాణి

SSMB 29 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందించిన కీరవాణి

Published on Mar 19, 2023 12:09 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా మంచి జోష్ తో కొనసాగుతున్నారు. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ లు సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్, వాటి అనంతరం సర్కారు వారి పాటతో మరొక బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని సెకండ్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఆయన చేస్తున్న SSMB 28 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే దీని తరువాత శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ పై కేఎల్ నారాయణ నిర్మాతగా జక్కన్న రాజమౌళి దర్శకత్వం సూపర్ స్టార్ మహేష్ SSMB 29 మూవీ చేయనున్న సంగతి తెలిసిందే.

గ్లోబల్ గా ఎంతో గొప్పగా క్రేజ్ కలిగిన ఈ ప్రాజక్ట్ గురించి ఇప్పటికే పలు కథనాలు మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగా తాజాగా స్వరవాణి కీరవాణి ఈ మూవీ గురించి మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ని అందించారు. ఈ మూవీని భారీ యాక్షన్ తో కూడిన అడ్వెంచరస్ డ్రామా మూవీగా రాజమౌళి తెరకెక్కించనున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా వెల్లడించారు కీరవాణి. సూపర్ స్టార్ మహేష్ బాబుని నెవర్ బిఫోర్ అవతార్ లో రాజమౌళి ఈ సినిమాలో చూపించనున్నారని, అలానే దీనిని పాన్ వరల్డ్ రేంజ్ లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యంత భారీ స్థాయిలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో జక్కన్న రూపొందించనున్నారని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు