విక్టరీ వెంకటేష్‌ క్లాప్‌తో ప్రారంభమైన యాక్షన్ థ్రిల్లర్ ’22’ !

విక్టరీ వెంకటేష్‌ క్లాప్‌తో ప్రారంభమైన యాక్షన్ థ్రిల్లర్ ’22’ !

Published on Jul 22, 2019 6:25 PM IST

శివకుమార్‌ బి. దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్ ’22’. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈరోజు (జులై 22) రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్లపై విక్టరీ వెంకటేష్‌ క్లాప్‌ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్‌.ఎన్‌ ప్రసాద్‌, నవీన్‌ ఎర్నేని, కొండా కృష్ణం రాజు సంయుక్తంగా కెమెరా స్విచ్‌ ఆన్‌ చేసారు. ముహూర్తపు షాట్‌కు ప్రముఖ దర్శకులు భీమినేని శ్రీనివాస రావు గౌరవ దర్శకత్వం వహించారు. పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ చిత్ర దర్శకుడు శివకుమార్‌కి స్క్రిప్ట్‌ అందించి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ఈ సందర్భంగా దర్శకుడు శివకుమార్‌ బి. మాట్లాడుతూ – ”ఈ ప్రారంభోత్సవానికి మా యూనిట్‌ని బ్లెస్‌ చెయ్యడానికి వచ్చిన విక్టరీ వెంకటేష్ గారికి, సాయితేజ్‌, హరీష్ శంకర్, బాబీ గారికి, అలాగే ప్రముఖ దర్శకులు, నిర్మాతలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఆయన ఈ కార్యక్రమానికి రావడం హ్యాపీ గా ఉంది. నేను మారుతి, పూరి జగన్నాథ్‌, వి.వి.వినాయక్‌గార్ల వద్ద వర్క్‌ చేశాను. ఈ సినిమా టైటిల్‌ ’22’ అనేది ఒక నెంబర్‌. ఆ నెంబర్‌కి ఒక కీ ట్విస్ట్‌ ఉంది. అది రివీల్‌ చేస్తే ఆ కిక్‌ ఉండదు. మర్డర్‌ మిస్టరీతో మిక్స్‌ అయిన కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఈనెల 29 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది.” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు