మాస్ మహారాజ రవితేజ హీరోగా పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రంలో రవితేజ సరసన అమలా పాల్ నటించనుంది. ‘సారోస్తారా’ అనే టైటిల్ ఖరారు చేసిన ఈ చిత్రంలో మొదటగా నిత్య మీనన్, త్రిషా లతో సంప్రదింపులు జరిపారు. ఒక దశలో పరుల్ యాదవ్ కూడా అనుకున్నారు. కాని చివరకు అమలా పాల్ ని ఖరారు చేసారు. ఆమె ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ వెల్లడించారు. అమలా పాల్ ‘నాన్న’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ‘లవ్ ఫెయిల్యూర్’ సినిమాతో దగ్గరయింది. ఇదే కాకుండా రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో రెండవ హీరొయిన్ గా కూడా ఎంపికయింది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కృష్ణమ్మ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్!
- సమీక్ష : “ఆరంభం” – ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది
- సమీక్ష : “ప్రతినిధి 2” – రొటీన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా !
- ఓటిటి: ‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
- ఫోటోలు: ఐశ్వర్య రాజేష్
- కలెక్షన్: సోనాల్ చౌహాన్
- “గోట్” కోసం యూఎస్ కి దళపతి విజయ్.!