ఎన్.టి.ఆర్ విశ్వరూపాన్ని బయటకు తీస్తున్న బోయపాటి

ఎన్.టి.ఆర్ విశ్వరూపాన్ని బయటకు తీస్తున్న బోయపాటి

Published on Nov 26, 2011 10:29 AM IST

కమర్షియల్ చిత్రాలను తీయటం లో బోయపాటి శ్రీను ది అందె వేసిన చెయ్యి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్. నటిస్తున్న ‘దమ్ము’ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరూ ఈ చిత్రం కోసం తీవ్రం గా కష్టపడుతున్నట్లు సమాచారం. ఎన్.టి.ఆర్. కమర్షియల్ విశ్వరూపాన్ని బయటకి తీయాలని బోయపాటి కృషి చేస్తున్నారు.

ప్రస్తుతం పోలాచ్చి లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే మైసూరు లో ఒక భారీ ఏక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దమ్ము 2012 వేసవి సెలవుల లో విడుదల అవుతంది.ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఏ వల్లభ ఈ చిత్ర నిర్మాత.

ఎన్.టి.ఆర్. సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. తొలుత శృతి హాసన్ హీరోయిన్ కాగా, ఆమె డేట్స్ తో ఇబ్బంది రావటంతో చిత్రం నుండి వైదొలిగారు. రెండవ హీరోయిన్ గా కార్తీక నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు