తూర్పు గోదావరిలో కలెక్షన్ల దుమ్ము దులుపుతున్న బిజినెస్ మేన్

తూర్పు గోదావరిలో కలెక్షన్ల దుమ్ము దులుపుతున్న బిజినెస్ మేన్

Published on Jan 20, 2012 4:25 PM IST

 

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ తూర్పు గోదావరి జిల్లలో కలెక్షన్ల తుఫాను సృష్టిస్తుంది. ఈ చిత్రం మొదటి వారానికి గాను 2 కోట్ల 27 లక్షల రూపాయలు వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టిస్తుంది. బ్లాక్ బస్టర్ చిత్రం ‘పోకిరి’ ఆల్ టైం షేర్ కంటే 2 లక్షల రూపాయలు ఎక్కువ వసూలు చేసింది. ఇదే జిల్లలో ‘దూకుడు’ లాంగ్ రన్ షేర్ 3 కోట్ల 10 లక్షల రూపాయలు కాగా ఈ రికార్డుని మరో వారంలోపే అధిగమిస్తుందని చెప్తున్నారు. పూరి జగన్నాధ్ డైలాగులు మరియు మహేష్ బాబు అధ్బుత నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటించగా ఈ చిత్రాన్ని ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు