గత కొంత కాలంగా మధు శాలిని తెలుగు చిత్రాలలో కనిపించలేదు.కాని మిగిలిన పరిశ్రమలలో ఈ భామకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గత సంవత్సరం ఈ భామ బాల దర్శకత్వంలో అవన్-ఇవన్ (వాడు-వీడు) చిత్రంలో ప్రధాన పాత్ర్రలో నటించింది. తరువాత రామ్ గోపాల్ వర్మ “డిపార్టుమెంటు” చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్ర దక్కించుకుంది. ఈ పాత్ర కోసం తనను తాను మలుచుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ తన రెండవ హిందీ చిత్రం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించ బోతున్న చిత్రం భూత్-2 చిత్రంలో మధు శాలిని ప్రధాన పాత్ర చేయ్యబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ఇది కాకుండా శంకర్ మార్తాండ్ రాబోతున్న చిత్రం “పొగ” లో ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కృష్ణమ్మ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్!
- సమీక్ష : “ఆరంభం” – ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది
- సమీక్ష : “ప్రతినిధి 2” – రొటీన్ పొలిటికల్ యాక్షన్ డ్రామా !
- ఫోటోలు: ఐశ్వర్య రాజేష్
- ఓటిటి: ‘బాహుబలి’ మేకర్స్ “యక్షిణి” పై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్
- “గోట్” కోసం యూఎస్ కి దళపతి విజయ్.!
- కలెక్షన్: సోనాల్ చౌహాన్