భూత్-2 లో మధు శాలిని?

భూత్-2 లో మధు శాలిని?

Published on Apr 20, 2012 4:25 PM IST

గత కొంత కాలంగా మధు శాలిని తెలుగు చిత్రాలలో కనిపించలేదు.కాని మిగిలిన పరిశ్రమలలో ఈ భామకు మంచి అవకాశాలు వస్తున్నాయి. గత సంవత్సరం ఈ భామ బాల దర్శకత్వంలో అవన్-ఇవన్ (వాడు-వీడు) చిత్రంలో ప్రధాన పాత్ర్రలో నటించింది. తరువాత రామ్ గోపాల్ వర్మ “డిపార్టుమెంటు” చిత్రంలో గ్యాంగ్ స్టర్ పాత్ర దక్కించుకుంది. ఈ పాత్ర కోసం తనను తాను మలుచుకున్న తీరు అందరిని ఆశ్చర్యపరిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ తన రెండవ హిందీ చిత్రం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించ బోతున్న చిత్రం భూత్-2 చిత్రంలో మధు శాలిని ప్రధాన పాత్ర చేయ్యబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ఇది కాకుండా శంకర్ మార్తాండ్ రాబోతున్న చిత్రం “పొగ” లో ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు